Saturday, April 27, 2024

వెయ్యి కిలోమీట‌ర్ల మైలురాయి దాటిన బండి సంజ‌య్ యాత్ర

3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలంలోని అప్పిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద బండి సంజయ్ పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా… బండి సంజయ్ పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం బండి సంజయ్ మొక్క నాటారు. ఈసంద‌ర్భంగా బీజేపీ శ్రేణులు బండి సంజయ్ ని ఘనంగా సత్కరించారు. 1000 వాలా బాణాసంచా కాల్చి, 1000 బేలూన్ లను గాల్లోకి ఎగరేసి, బీజేపీ కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకున్నారు. 82రోజులుగా సాగిస్తున్న ఈ యాత్ర 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన‌సాగుతూ… ఈరోజు వెయ్యి కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement