Thursday, April 25, 2024

సచివాలయంపై ఏసీబీ దాడులు…

కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొన్నుటూరు సచివాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు. ఈ దాడిలో పొన్నుటూరు వీఆర్వో టీ.సోమేశ్వర రావు ఒక రైతు నుండి రూ.15000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఏసీబీ సీఐ భాస్కర రావు తెలిపారు. రైతు భూమికి సంబందించి పట్టాదార్ ఈ పాస్ పుస్తకం కోసం ముటేషన్ చేయుటకు రైతు నుండి వీఆర్వో సోమేశ్వర రావు డిమాండ్ చేశారు. రైతు ఏసీబీని ఆశ్రయించడంతో వీఆర్వో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు సీఐ భాస్కర రావు వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement