Friday, May 3, 2024

రోడ్డు ప్ర‌మాదంలో యువకుడు మృతి

వ‌రంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన నారగోని ప్రశాంత్ తన మిత్రులతో కలిసి పట్టణం నుండి తిరుగు ప్రయాణంలో ప్ర‌మాద‌వ‌శాత్తు వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం లారిని ఢీకొన‌గా ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షత గాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement