Thursday, April 25, 2024

విడాకులు తీసుకున్న సింగ‌ర్ యో యో హ‌నీసింగ్-షాలినీ త‌ల్వార్

ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విడాకులు తీసుకున్నారు. వారి బాట‌లో పంజాబీ సింగ‌ర్..యాక్ట‌ర్
యోయో హనీ సింగ్ – షాలినీ తల్వార్ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది షాలినీ తల్వార్ లైంగిక వేధింపులు, గృహహింస కింద ఢిల్లీ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఏడాది పాటుగా పలుసార్లు విచారణ జరిపిన న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. న్యాయమూర్తి వినోద్ కుమార్ సమక్షంలో హనీ సింగ్ – శాలిని తల్వార్‌కు విడాకులతో పాటు భరణంగా రూ.కోటి కూడా అందించారు. ఈ కేసు తదుపరి విచారణ 2023 మార్చి 20న మళ్లీ జరగనుంది. అందులో తదుపరి మోషన్‌పై విచారణ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement