Monday, May 6, 2024

బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

జనగామ : క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ సీ విద్యార్థిని బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. జనగామ మండలంలోని యశ్వంతపూర్ గ్రామంలో గల క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో వలబోజి సంతోషి ఇంజనీరింగ్ సిఎస్ సి మొదటి సంవత్సరం చ‌దువుకుంటుంది. ఆమె మధ్యాహ్నం కళాశాల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కళాశాల యాజమాన్యం విద్యార్థిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు తెలిసింది. ఘటనస్థలానికి సీఐ శ్రీనివాస్ చేరుకుని విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement