Sunday, May 19, 2024

వైద్యుల నిర్లక్ష్యంతో 5నెలల బాబు మృతి : ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా..

జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస పిల్లల ఆసుపత్రిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. వివరాలకెళ్తే తరిగొప్పుల మండలం అంకుశాపురం గ్రామానికి చెందిన కందుల రాకేష్, అనూష దంపతుల 5 నెలల బాబుకు పిడిస్ సమస్యతో ఉదయం 10గంటలకు జనగామలోని శ్రీ శ్రీనివాస పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించుకుని ఫీజులు కట్టించుకున్నారు. మధ్యాహ్నం 12.30 లకు చిన్నారి మృతి చెందింది.. అయితే అసలు వైద్య సేవలు అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ధ ఆందోళన నిర్వహించారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే బాబు మృతి :
ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ.. వైద్యం అందించడంలో లేదనీ, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప ప్రాణాలు కోల్పోయిందని పలువురు ఆరోపించారు. ఇందుకు కారణమైన ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ… బంధువులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా వెంటనే ఆస్పత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement