Monday, May 6, 2024

Breaking : కోర్టులో జ‌రిగిన చోరీతో సంబంధం లేదు – ఏ విచార‌ణ‌కైనా సిద్ధ‌మే – మంత్రి కాకాణి

కోర్టులో జ‌రిగిన చోరీతో త‌న‌కు సంబంధం లేద‌ని ఏపీ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ తెలిపారు. నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన ఫైలును దొంగ‌లు ఎత్తుకుపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో జరిగిన చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ అంశంపై తాను ఏ విచారణకైనా సిద్ధమేనని అన్నారు. హైకోర్టుకు వెళ్లొచ్చని, లేదా సీబీఐతో విచారణ జరిపించుకోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నానని, అందువల్ల ప్రభుత్వ విచారణ కూడా జరిపించుకోవచ్చని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎవరితోనూ బేదాభిప్రాయాలు లేవని అన్నారు. అందరం కలిసి పని చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement