Wednesday, May 8, 2024

విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి                        

వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ముచినిపర్తి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో రెండు పాడి గేదెలు మృతి చెందాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. చల్లగరిగ గ్రామానికి చెందిన పాడి గేదెలు మేత కోసం పశువుల కాపరి ముచిని పర్తి గ్రామ శివారులో మేపు ఉండగా.. పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. దీంతో లక్ష రూపాయల నష్టం జరిగినట్లు బాధిత రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement