Monday, April 29, 2024

రేప‌టి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక ఉత్స‌వాలు…

తొర్రూర్ డివిజన్ కేంద్రం కంటాయాపాలెం లో వెల‌సిఇన‌ శ్రీ వెంక టేశ్వర స్వామి ఆలయంలో రేప‌టి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 19వ వార్షికోత్సవాలు ప్రారంభ మవుతున్నాయని ఆలయ నిర్వాహకులు దాక్టర్ రాజేందర్ రెడ్డి స్థానాచార్యులు ఆలయ అర్చకులు ఆరుట్ల శ్రీకాంత్ ఆచార్యులు తెలిపారు. తొలి రోజు ఉద‌యం ఉత్సవారంభ స్థపనము(అభిషే కం)సాయంత్రం 6 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరా ధన ,పుణ్యాహవాచనము, రక్షాబంధనం యాగశాల ప్రవేశం, తీర్థగోష్టి నిర్వ‌హిస్తారు. 15 సోమవా రం రోజున ఉదయం 7గంటల కు ప్రాభో దకి,8 గంటలకు నిత్య హవ నము పారాయణాలు గరుడపట ప్రతిష్టాపన 11:00 , పూర్ణాహుతి11:30 నిమిషాల కు ధ్వజారో హణం సాయంత్రం 6 గంటలకు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం పూజాదికార్యక్రమాలు కొన‌సాగుతాయి.. 16 మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యా ణోత్సవం ఆశీర్వచనము సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము సాయంత్రం 6 గంటలకుపద్మా వతి సమేత శ్రీవెంకటే శ్వర స్వామి వారి తిరువీధి ఉత్స వం ఉంటుంది. 17న బుధవారం రోజున ఉదయం 10 గంటల కు మహా పూర్ణాహుతి 11గంటలకుసా యంత్రం శ్రీ పుష్పయాగం తదితర కార్యక్రమాలు తీర్థప్రసా దాల వినియోగం ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement