Thursday, May 16, 2024

డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే: తనీష్

టాలీవుడ్‏లో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేగింది. యువ హీరో తనీష్‏కు డ్రగ్స్ కేసులో భాగంగా నోటీసులు వచ్చినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై తనీష్ స్పందించాడు. డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు తనకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని హీరో తనీష్ తెలిపాడు. 67 NDPS యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారన్నాడు. అయితే బెంగళూరు సినిమా వాళ్ల వ్యవహారంలో విట్‌నెస్‌గా హాజరుకావాలని తనకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించాడు. బెంగళూరులో 2017లో శంకర్ గౌడ ఇచ్చిన పార్టీకి వెళ్లానని, కానీ పార్టీలో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తనీష్ స్పష్టం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement