Friday, May 3, 2024

పల్లా కే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి – సింధూర

మరిపెడ మున్సిపాలిటీ లో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్ ఆధ్వర్యంలో డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి గుడిపూడి నవీన్ రావు ఆదేశానుసారం ఆదివారం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచారం నిర్వ‌హించారు. మరిపెడ మున్సిపాలిటీ 15వ వార్డు లో ఇంటింటికి వెళ్లి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లలను కోరారు.కరపత్రాలు,వాల్ పోస్టర్లుతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ కౌశల్యా గణేష్,సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్,సోమన్న,లతీఫ్,గంధసిరి కృష్ణ, రాజు,గణేష్,ఎలక్షన్ ఇంచార్జలు, బూత్ ఇన్చార్జిలు, ముఖ్య కార్యకర్తలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement