Saturday, April 27, 2024

Telangana – నిత్య కోతల నుంచి నిరంతర వెలుగులు – వినోద్ కుమార్

సిరిసిల్ల – : నిత్య కోతల నుంచి నిరంతరం వెలుగులు అందిస్తూ.. రాష్ట్రంలో విద్యుత్ ప్రగతి ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోందని, దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని, అయితే తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించి ఎంతో పురోగతి సాధించామని, ప్రస్తుతం మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా అడుగులు వేస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు. కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు నిర్మించడం వల్ల రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,140 యూనిట్లకు చేరిందని, ఇది జాతీయ సగటు ( 1,255 ) కంటే 70% అధికమని వినోద్ కుమార్ వివరించారు. భవిష్యత్తులో అవసరమైన 820 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, టేస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, సెస్ సంస్థ చైర్మన్ రామా రావు, జెడ్పీ ఛైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ సిద్దం వేణు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement