Thursday, May 2, 2024

Vikarabad : ప్రజాసేవకి అంబులెన్స్ ఇచ్చిన .. మాజీ మంత్రి చంద్రశేఖర్

వికారాబాద్ (ప్రభ న్యూస్): గ్రామీణ ప్రాంతం వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రజల సౌకర్యార్థం.. వైద్య ఆరోగ్యశాఖకు తన వంతు సహకారంగా అంబులెన్స్ ని అందిస్తున్నట్టు మాజీ మంత్రి బిజెపి నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని.. పూర్తిగా గ్రామీణ ప్రాంతంతో కూడిన వికారాబాద్ నియోజకవర్గం ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శివప్రసాద్.. మాజీ కౌన్సిలర్ సురేష్.. సీనియర్ నాయకులు శంకర్, విజయభాస్కర్ రెడ్డి వికారాబాద్ పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి రాఘవ నాయక్, పసుల మహేష్ బసవలింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement