Saturday, April 27, 2024

TS: హెచ్ఎండీఏ కార్యాలయంలో విజలెన్స్ దాడులు…

హైదరాబాద్ – అమీర్‌పేట్‌ స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోని హెచ్ఎండిఏ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు.. వివిధ జోన్లకు చెందిన ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఫైళ్లపై ప్రత్యేక పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. కాంప్లెక్స్‌లోని ఏడవ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్‌కు ఫైళ్లను తెప్పించుకొని విజిలెన్స్ అధికారులు స్టడీ చేస్తున్నారు. గడిచిన 10ఏళ్లలో విక్రయించిన హెచ్ఎండిఏ భూముల వివరాలతో పాటు భారీగా అవినీతికి పాల్పడి ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కిన శివ బాలకృష్ణ మంజూరు చేసిన లేఅవుట్ల మంజూరి, నిర్మాణ అనుమతుల ఫైళ్లను కూడా స్టడీ ప‌రిశీలిస్తున్నారు..

శివ బాలకృష్ణ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆయన మంజూరు చేసిన దాదాపు 130 నుంచి 150 ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎండిఏ భూముల అమ్మకంతో సమకూర్చుకున్న సుమారు రూ.పదివేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారు ?ఎలా ఖర్చు చేశారు? అన్న విషయాలను విజిలెన్స్ అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement