Friday, April 26, 2024

ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి పథకం.. జడ్పీ చైర్పర్సన్ దపెదార్ శోభ

ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం దేవుడిచ్చిన వరమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ దపెదార్ శోభ అన్నారు. మండలంలోని మహమ్మద్ గ్రామంలో మహమ్మద్ నగర్, బూర్గుల్ గ్రామాలతో పాటు 30 మంది లబ్ధిదారులకు కళ్యాణి లక్ష్మి చెక్కులను జడ్పీ చైర్పర్సన్ శోభ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దపెదార్ రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గునుకుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, బిఆర్ఎస్ నాయకులు చింత కింది కాశయ్య, రామా గౌడ్, అఫ్జల్, జీవన్, మహేందర్, ఇఫ్తాకర్ దొర నరేష్ పటేల్, పంచాయతీ కార్యదర్శి హరీష్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement