Tuesday, March 26, 2024

మనోహర్‌రెడ్డి గెలుపే ముఖ్యం – బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): భారత్‌ రాష్ట్ర సమితి అంటే తనకు ప్రాణంతో సమానమని, పెదపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి హ్యాట్రిక్‌ విజయమే తనకు ముఖ్యమని బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని, కుటుంబంలో సమస్య వచ్చినపుడు నిరసన తెలియజేసిన విధంగానే రెండు రోజుల క్రితం తన బాధను తెలియజేశానన్నారు. తనను బిఆర్ఎస్ కు దూరం చేయాలని రెండు రోజులు చాలామంది ప్రయత్నించారన్నారు. ఎప్పటికి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటానని, రాబోయే ఎన్నికల్లో మనోహర్‌రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిదేళ్లలో దాసరి పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో మరింత దూసుకుపోతుందన్నారు. రాజ్‌కుమార్‌ మొదటి నుంచి పార్టీ పటిష్టతలో క్రియాశీలకంగా వ్యవహరించార‌ని ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. రాబొయే రోజుల్లో పట్టణ అధ్యక్షునిగా పార్టీ పటిష్టతకు పని చేస్తార‌న్నారు. పార్టీలో రాజ్‌కుమార్‌కు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement