Sunday, May 19, 2024

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ‌లో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం ప్ర‌ధాన‌మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే త‌న వాటా నిధులు విడుద‌ల చేయ‌గా… రాష్ట్ర వాటా నిధులు ఇప్ప‌టిదాకా విడుద‌ల కాలేద‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు. ఆ ప‌థ‌కానికి సంబంధించిన రాష్ట్ర వాటా నిధుల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని కూడా కిష‌న్ రెడ్డి కోరారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప‌థ‌కం కింద తెలంగాణ‌కు సంబంధించి వ‌రంగ‌ల్ లోని కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఎంపిక‌య్యాయి. వీటికి రూ.120 కోట్ల‌ను కేటాయించిన కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే త‌న వాటా నిధుల‌ను విడుద‌ల చేసింది. త‌క్ష‌ణ‌మే రాష్ట్ర వాటా నిధులు విడుద‌ల చేయాల‌ని కేసీఆర్‌ను కిష‌న్ రెడ్డి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement