Thursday, May 23, 2024

అబద్ధాలు, అవినీతికి అడ్డా వైసీపీ, నేనే ఉంటే ఈపాటికి పోల‌వరం ఉర‌క‌లెత్తేది: చంద్ర‌బాబు

త‌న‌పై లెక్క‌లేన‌న్ని ఆరోప‌ణ‌లు చేశార‌ని, పోలవరంపై అవినీతి ఆరోపణలు చేసి పైసా కూడా నిరూపించలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అబద్ధాల పార్టీ, అవినీతికి అడ్డా వైసీపీ అని విమర్శించారు. తాము అధికారంలో కొనసాగి ఉంటే ఈ పాటికి పోలవరం ఉరకలెత్తేదన్నారు. ప్రజా సమస్యలు చెప్తున్నప్పుడు 200 కాకపోతే 2000 కేసులు పెట్టుకోండి.. ఏమీ చేయలేరని పేర్కొన్నారు. పోలీసులు ఖబడ్దార్.. చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలని సూచించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయం లో జరిగిన i TDP meet and greet కార్యక్రమంలో ఉత్సాహంగా ప్ర‌సంగించారు టిడిపి అధినేత చంద్రబాబు. కార్యకర్తలకు ఆరోగ్యపరంగా, వృత్తి పరంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తామని చెప్పారు. అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే యువత ఉద్యోగాల కోసం ఎక్కడికీ పోవాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. హైదరాబాద్, బెంగ‌ళూరు, చెన్నై ఆయా రాష్ట్రాలకు ఆదాయం తెచ్చినట్లు అమరావతి మన ఏపీకి ఆదాయం తెచ్చిపెట్టేదని పేర్కొన్నారు. అమరావతికి కులం అంటగట్టి, శ్మ‌శానం అంటూ నిర్వీర్యం చేస్తుంటే ఎవరికీ రోషం లేదా.. ఉండ‌దా అని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement