Wednesday, May 15, 2024

TS: మంత్రి మ‌ల్లారెడ్డి ఉదార‌త‌.. ఆ విలేజ్‌ల‌కు ఏం ఇచ్చారో తెలుసా!

Medchal : మంత్రి మ‌ల్లారెడ్డి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. అంతిమయాత్ర సంద‌ర్భంగా అన్ని గ్రామాల్లో ప‌డే ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ఆ గ్రామ‌స్తుల కోరిక మేర‌కు ఫ్రీజ‌ర్‌ల‌ను అందించారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని 13 గ్రామాలకు తన సొంత నిధులతో డెడ్ బాడీ ఫ్రీజర్లను అందించారు మంత్రి మ‌ల్లారెడ్డి. మండల కార్యాలయ ఆవరణలో ఆయా గ్రామాల‌ సర్పంచులకు వీటిని అందించారు. ఈ ఫ్రిజర్ లను పంచాయతీ ఆఫీసులోనే ఉంచి గ్రామంలో ఎవ‌రైనా చ‌నిపోతే.. వారి అవ‌స‌రాల‌కోసం తీసుకెళ్లొచ్చ‌ని సూచించారు.

దీనికి ఎట్లాంటి డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అలాగే ధరణి పోర్టల్ ప్రారంభమై నేటికి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మండల కార్యాలయం సందర్శించి ధరణి పనితీరుపై అధికారులను మంత్రి మ‌ల్లారెడ్డి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement