Thursday, May 2, 2024

TS – రైల్వే డెవ‌ల‌ప్‌మెంట్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాం -ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌..

ఆధునికీకరించిన బేగంపేట్ రైల్వే స్టేషన్ ప్రధాని మోడీ నేడు వర్చువల్ గా ప్రారంభించారు… ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైల్వేస్ దేశం మొత్తం లో అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ నెట్ వర్క్ అని అన్నారు. తక్కువ ధర తో ఎక్కువ దూరం ప్రయాణం చేయ‌వ‌చ్చ‌ని, అలాగే , సరకు రవాణాకి అనువైన వ్యవస్థ అని వివ‌రించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే విస్తరణ, అభివృద్ధికి త‌మ వంతు సహకారం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కి రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా కలిసి పని చేస్తామన్నారు.

రాష్ట్ర విభజన సమయం లో ఇచ్చిన‌ హామీ ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెండిగ్ లో ఉంద‌ని, … అది త్వరగా వచ్చేలా చూడాలని ఎంపీ లక్ష్మణ్ కి విజప్తి చేశామన్నారు. గవర్నర్ తమిళ సై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొంటున్నారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈనెల 27న చేవెళ్ల లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్తును అందించే పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మార్చి నెలలో అర్హులైన వినియోగదారులు 200 యూనిట్ల వరకు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఎంపీ డా. కె లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఢిల్లీ నుండి దేశ వ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ల పునరభివృద్దికి శంకుస్థాపన, 1500 అండర్ పాస్ లను వర్చువల్ ప్రారంభించడం చాలా సంతోషం అన్నారు. మోదీ అంటే మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా అని, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కేంద్రం రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తోందన్నారు. కేంద్ర రైల్వే బడ్జెట్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కు ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ముఖ్యంగా తెలంగాణ ROB కి ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధికి జిఎం అరుణ్ కుమార్ జైన్ ఎంతో కృషి చేస్తున్నార‌ని తెలిపారు.

కాగా, అంత‌కు ముందు బేగంపేట రైల్వే స్టేషన్ కి వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ల‌కు రైల్వే డీజీ మహేష్ భగవత్, జీఎం అరుణ్ కుమార్ జైన్ స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు భట్టి బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement