Sunday, May 5, 2024

TS: పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం.. త్వరలో అఖిల పక్ష భేటీ : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సూర్యాపేట‌: పొడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తెలంగాణ‌ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సీఎం కేసీఆర్ కు నివేదిక అందించంద‌న్నారు. అందులో బాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పొడు భూముల సమస్యకు తెరదించే ప్రయత్నంలో భాగంగ ఏర్పాటైన ఉపసంఘానికి కోనసాగింపుగా సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం ఆయా జిల్లాల్లో కలెక్టర్ లతో పాటు అదనపు కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇందులో భాగంగా శనివారం సాయంత్రం సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో నల్లగొండ, సూర్యపేట, భువ‌నగిరియదాద్రి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో పాటు మూడు జిల్లాల అటవీశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పొడు భూములను సాగు చేసుకుంటున్న వారి వివరాలు పకడ్బందీగా సేకరించాలని చెప్పారు. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యహరించాలన్నారు. సమగ్ర అధ్యయనం మీదట ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు పొడు భూములపై హక్కులు కలిగించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశంలో సూర్యపేట,నల్లగొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ప్రశాంత్ జీవన్ పాటిల్, పమేలా సత్పతి అదనపు కలెక్టర్ లు మోహన్ రావు,శ్రీనివాస్ రెడ్డి,చంద్రశేఖర్ లతో పాటు మూడు జిల్లాల అటవీశాఖ అధికారులు ముకుందరెడ్డి, రాంబాబు,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement