Thursday, May 2, 2024

రా రైస్, బాయిల్డ్ రైస్ కాదు.. ధాన్యం కొనుగోలు చేయాల్సిందే

రా రైస్, బాయిల్డ్ రైస్ కాదు ధాన్యం మొత్తం కొనాల్సిందేనని రైతు బంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని చౌటుప్పల్, వలిగొండ జాతీయ రహదారులను దిగ్భంధం చేశారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక నరేంద్రమోదీ అక్కసు వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, పాండు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement