Saturday, May 18, 2024

Breaking: సంగారెడ్డిలో తుపాకులతో ఇద్దరు హల్ చల్

సంగారెడ్డి : ఇద్దరు వ్యక్తులు తుపాకులతో హల్ చల్ చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ లో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ తాండాలో ప్లాట్లు కొనుగోలు చేద్దామని హైదరాబాద్ నుండి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్లాట్ల గురించి డిస్కషన్ చేస్తుండగా గన్స్ తీసి భయపెట్టే యత్నం చేశారు. గన్స్ ని చూసి తండావాసులు అంతా గుమికూడి వారిపై దాడి చేశారు. వెంటనే అక్కడున్న కొందరు వ్యక్తులు అమీన్పూర్ పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఇద్దరి అదుపులోకి తీసుకుని తొలుత ప్రథ‌మ చికిత్స నిమిత్తం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. గన్స్ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. గన్స్ లైసెన్స్ కలిగినవని ఎవరి పేర్ల మీద అవి ఉన్నాయో విచారించి చెబుతామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement