Saturday, April 27, 2024

కరోనా బారిన పడిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వరుసగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా జగిత్యాల శాససభ్యుడు డా.సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తన ఇంట్లో వంట మనిషికి పాజిటివ్ నిర్దారణ కాగా, ఎమ్మెల్యే కూడా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో పరీక్షల్లో  ఎమ్మెల్యేకు పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో వైద్యుల సూచనలతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తనను కలిసిన వారు కరోనా నిర్దారణ పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement