Saturday, May 4, 2024

చండూలో టీఆర్​ఎస్​ మెరుపు ధర్నా.. కారు గుర్తును పోలిన సింబల్స్​ తొలగించాలని డిమాండ్​

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులో ఉద్రిక్తత నెలకొంది. చండూరు తహసీల్దార్​ ఆఫీసు ముందు టీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మునుగోడు ఉప ఎన్నికలో TRS పార్టీ కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, డోజర్, గుర్తులను ఇతర పార్టీలకు, ఇండిపెండెంట్​ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించడంపై కార్యకర్తలు భగ్గుమన్నారు. కారు గుర్తును పోలిన ఇతర గుర్తులను తొలగించాలని ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో తహసీల్దార్​ ఆఫీసు వద్ద గందరగోళం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement