Monday, May 13, 2024

ఆదిలాబాద్ లో బస్సు బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారుజామున ఇచ్చోడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే రిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మహరాష్ట్రలోని నాగ్ పూర్ నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement