Monday, April 29, 2024

టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తృటిలో తప్పిన పెను ప్రమాదం

క‌రీంన‌గ‌ర్ – టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చార్జిషీట్ పై టీపిసిసి కార్యవర్గం నిర్వహించిన సమావేశంలో పాల్గొని కరీంనగర్ కి తిరుగు ప్రయాణం అవుతుండగా మార్గమధ్యంలో తూంకుంటలో రోహిత్ రావు వాహనానికి ఒక ఆవు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో వాహనం ముందు భాగం ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో రోహిత్ రావు స్వల్ప గాయలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో రోహిత్ రావు మాట్లాడుతూ తను ఆరోగ్యంగానే విశ్రాంతి తీసుకుంటున్నాన‌ని, అభిమానులు ఎవ్వరూ కంగారు పడొద్దని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement