Monday, May 20, 2024

కేసీఆర్‌ పాలన అంత‌మే లక్ష్యం.. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌

వికారాబాద్‌, ప్రభన్యూస్‌: ఎందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబానికి సొంతం అయిందని, తెలంగాణలో త్వరలో కమల వికాసం తథ్యం అని, బండి సంజయ్‌ నేతృత్వంలో అధికారమే ధ్యేయంగా బీజేపీ శ్రేణులు ముందుకు సాగాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ బీజేపీ ఇన్‌చార‌జి తరుణ్‌ చుగ్‌ పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వానికి అండగా ఉంటున్నారని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రూపొందించటం కోసం ప్రతి బీజేపీ నాయకులు, కార్యకర్త నడుం బిగించాలని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అని అన్నారు.

మాజీ మంత్రి చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ నిజమైన తెలంగాణ వాదులు టీఆర్‌ఎస్‌లో లేరని, కేవలం కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. ఏ క్షణాన ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్ధాయి నుండి పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానంద్‌ రెడ్డి మాట్లాడుతూ మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని పటిష్టం చేస్తామని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement