Thursday, May 9, 2024

టిప్పర్, ఆటో ఢీకొని : ముగ్గురు మృతి

టిప్ప‌ర్, ఆటో ఢీకొన్న ఘోర రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఇస్నాపూర్ వద్ద గురువారం తెల్ల‌వారుజామున‌ టిప్పర్, ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పఠాన్ చెరు పోలీసులు తెలిపిన వివరాలు మేరకు… పఠాన్ చెరు మండల పరిధిలోని హైవేపై.. ఇస్నాపూర్ వద్ద అతివేగంతో వెళుతున్న ఆటో అదుపుతప్పి రోడ్డు ఆవలివైపు వెళ్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జయింది. ఈఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇస్నాపూర్ లోని స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా ఈప్రమాదం సంభవించింది. ప్రమాదంపై వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన ముగ్గురిని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమయంలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మరొకరికి గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పఠాన్ చెరు పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సమీక్షించారు. మృతుల్లో ఇద్దరు పఠాన్ చెరులోని తోషిబా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న తిరుమలవాసు(34), ఆటో డ్రైవర్ సాయి బన్నన్(27),గా గుర్తించిన పోలీసులు మరొకరి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేస్తి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం పటాన్‌చెరువు ప్రభుత్వ హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు. తీవ్రగాయాల పాలైన మరొకరిని కూడా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement