Monday, May 20, 2024

బైక్ ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు – నంద్యాల రహదారిపై నల్లమల అటవీ ప్రాంతంలో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారాన్ని అందుకున్న గిద్దలూరు హైవే మొబైల్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మోటార్ సైకిల్ ను ఢీ కొట్టిన లారీని వెంబడించి డ్రైవర్ ను పట్టుకొని గిద్దలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement