Friday, April 26, 2024

ప్రతి ఒక్క‌రికీ ఉచిత వైద్య సేవలందించ‌డ‌మే ప్రభుత్వ లక్ష్యం -మంత్రి మల్లారెడ్డి

128 చింతల్ డివిజన్ లో గల ఎన్ఎల్ బీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తి దవాఖానను కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి MLA వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో బస్తీలలో నివసించే ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచిత వైద్య సేవలందించాల‌నే ఉద్దేశంతో GHMC పరిధిలో డివిజన్ కి రెండు చొప్పున బస్తి దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు. ఈ అవకాశాన్ని డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంక్షేమ సంఘం నాయకులు, డివిజన్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement