Monday, April 29, 2024

TS: మత్స్య కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. మంత్రి తలసాని

నిజామాబాద్ రూరల్ : మత్స్య కార్మికులకు ప్రభుత్వం అండగా పనిచేస్తుందని, కార్మిక సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మత్స్య పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లిలో 50 లక్షల రూపాయలతో చేపల మార్కెట్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన అన్నారు.

అనంతరం అర్శా పల్లిలో చేపల మార్కెట్ భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. న్యాల్ కల్ లోని మసాని చెరువులో చేప పిల్లలు వదిలారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జగన్ లు మంత్రిని శాలువాతో సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement