Sunday, May 5, 2024

నా ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రత కల్పించండి – సిపి కి శ్రావణ్ వినతి

ప్రభ న్యూస్ విజయవాడరాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుండే తన ప్రాణాలకు ముప్పు వుందని భద్రత కల్పించాలని జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. విజయవాడలో కమిషనర్ క్రాంతి రానా టాటా ను కలిసిన ఆయన ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా తన ప్రాణాలకు మొప్పు వుందని వ్రాతపూర్వక శ్రవణ్ కుమార్ అభ్యర్థించారు.

రాష్ట్ర ప్రభుత్వమే తనకు రక్షణ కల్పించాలని తనకి తన కుటుంబానికి ఎటువంటి ప్రాణహాని జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే భాధ్యత వహించాలని హెచ్చరించారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడుతానని దానికి ప్రభుత్వ పెద్దలే ప్రాణాలు తీయడానికి ప్రణాళిక రచన చేస్తారా?? అంటూ ప్రశ్నించరు. తనకి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వ పెద్దల నుండే ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తన భద్రతపై కార్యకర్తలో ఆందోళన ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement