Saturday, April 27, 2024

త్వరలో కొత్త రేషన్ కార్డులు: కేటీఆర్

తెలంగాణలో అర్హులైన పేద ప్రజలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ  మంత్రి కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని 2008లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పదవికి లక్ష్మారెడ్డి రాజీనామా చేసారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. తెలంగాణ రాక మునుపు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో పెన్షన్ల కోసం యుద్దం చేసే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లిస్తున్నామని..త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గతంలో ఏప్రిల్, మే నెలల్లో కరెంటు కోతలుండేవి… ఇపుడు 24 గంటల కరెంటుస్తున్నామని తెలిపారు. జడ్చర్ల తొలి మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులను గెలుపును కానుకగా ఇవ్వండి, అభివృద్దిని చేసి చూపిస్తామన్నారు. ప్రైవేట్ టీచర్లకు అండగా నిలబడ్డామని మంత్రి కేటీఆర్ వివరించారు.

విద్య, వైద్యం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆదుకోవడానికి సీఎం కేసీఆర్​ పలు పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడించారు. అందరి ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు తాగు, సాగునీరు అందించడానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement