Monday, May 6, 2024

తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 389 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88,347 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో 420 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,55,732 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,45,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,276 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,862కి చేరింది. కరోనా మరణాల రేటు జాతీయస్థాయిలో 1.3 శాతం ఉండగా, తెలంగాణలో 0.58 శాతానికి దిగొచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 36, నల్గొండ జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

ఇది కూడా చదవండి: చీర కట్టులో పీవీ సింధు

Advertisement

తాజా వార్తలు

Advertisement