Friday, May 3, 2024

నేడు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేత‌ల స‌మావేశం

తెలంగాణ బీజేపీ నేతలు ఈరోజు ఢిల్లీలో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఇన్ చార్జి తరుణ్ చుగ్ పాల్గొననున్నారు. అకస్మాత్తుగా ఈ సమావేశాన్ని నిర్వహించడం వెనక ముఖ్య కారణం మీడియా విషయంలో చర్చించడానికే అని స‌మాచారం. ప్రధానిపై టీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో ఉన్న ఒక ప్రధాన పత్రిక, టీవీ ఛానల్ ప్రధానితో పాటు బీజేపీపై అసత్య ప్రచారం చేస్తుందని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై బీజేపీ నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మనోహర్ రెడ్డి పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement