Thursday, May 2, 2024

డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాన‌న్న సురేష్ రెడ్డి

కుత్బుల్లాపూర్ : డ్రైనేజీ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిస్తామ‌ని సురేష్ రెడ్డి అన్నారు. ఎస్టీపీ ప్లాంట్ ను ఉప‌యోగంలోకి తీసుకురావాల‌ని కార్పొరేట‌ర్ హేమ‌ల‌త సురేష్ రెడ్డికి రాజీవ్ గృహ‌క‌ల్ప సురారం కాల‌నీ అధ్య‌క్షుడు శివ‌గౌడ్ విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా కార్పొరేట‌ర్ మాట్లాడుతూ.. రాజీవ్ గృహకల్ప సురారం కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందని, ఎస్టీపీని అభివృద్ధిలోకి తీసుకువస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

వెంటనే అధికారులతో మాట్లాడి ఉపయోగంలోకి తీసుకువస్తా అన్నారు. అలాగే హౌసింగ్ బోర్డ్ నుండి వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ వారు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, తిరుపతి, రాధాకృష్ణ, నవనాథ్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement