Friday, April 26, 2024

సురక్ష దినోత్సవంలో.. ఎమ్మెల్యే దాసరి

ఎందరో పోలీస్ అమరవీరుల త్యాగ ఫలితమే సమాజంలో నెలకొన్న శాంతికి కారణమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సురక్ష దినోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన పోలీస్ అధికారులు శాంతి పద్ధతుల పరిరక్షణలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టారన్నారు. పోలీసుల త్యాగాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు జీతాలు పెంచడంతోపాటు అనేక అత్యధిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ పుట్ట మధు డిసిపి వైభవ్, అదనపు కలెక్టర్ లు లక్ష్మీనారాయణ, దీపక్ కుమార్, ఏసీపీలు మహేష్ మోహన్ లతోపాటు పలువు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement