Monday, April 29, 2024

RR: ప్రేమజంట ఆత్మహత్య..

బొంరాస్ పేట్, డిసెంబర్ 4 (ప్రభ న్యూస్): దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. లగ చర్ల గ్రామానికి చెందిన ఎండి మస్కాన్ (21) దినసరి కూలీ కాగా, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక మీనాక్షి (13) హకింపేట్ జెడ్పి హెచ్ ఎస్ లో 9వ తరగతి చదువుతుంది.

వీరిరువు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో తమ ఇండ్లల్లో ఇద్దరినీ మందలించారు. మనస్థాపానికి గురైన ప్రేమికులు ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ శంకర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో లగచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement