Friday, May 3, 2024

Anakapalle: పుణ్యస్నానాల్లో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

కార్తీకమాసం పుణ్యస్నానాల్లో ఇద్దరు మహిళలు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లాలోని కసింకోట మండలంలోని జోగారావుపేట గ్రామానికి చెందిన నారపురెడ్డి లక్ష్మి, అరట్ల మంగ అనే ఇద్దరు మహిళలు ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా జోగారావుపేట దగ్గర శారదానదికి నదీ స్నానాలకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలతో పాటుగా మరో ఇద్దరు మహిలు కార్తీకమాసం పుణ్య స్నానాల కోసం నదిలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఆ నలుగురు మహిళల్లో ఇద్దరు మహిళలను రక్షించగలిగారు. కాగా నారపురెడ్డి లక్ష్మి, అరట్ల మంగనీటిలో మునిగి మరణించారు. కార్తీక మాస పుణ్య స్నానాలకు వెళ్లి మహిళలు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement