Wednesday, May 1, 2024

Pakistan – ఉగ్ర‌వాదులు ర‌క్త‌దాహం .. బ‌స్సుపై కాల్పులు … ప‌ది మంది మృతి..

పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పులలో 10 మంది ప్ర‌యాణీకులు మర‌ణించారు. కారకోరం హైవేపై ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జర‌ప‌డంతో డ్రైవర్ నియంత్రణ కోల్పో ముందు నుంచి వచ్చిన బస్సు.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మ‌ర‌ణించ‌డంతో పాటు 25 మంది గాయపడ్డారు. ఈ దాడిలో మరణించిన వారిలో ఇద్దరు సైనికులు కూడా ఉన్నారని డైమర్స్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యుడు కూడా గాయపడ్డారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement