Saturday, April 27, 2024

FLASH: భవనంపై నుండి పడి ఫార్మసీ విద్యార్థి మృతి

హన్మకొండలోని చైతన్య ఫార్మసీ కళాశాల వసతి భవనం పై నుంచి విద్యార్థి రబిహుల్ ఖాన్ కింద పడి మృతి చెందింది. శుక్రవారం వసతి భవనం 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు విద్యార్థి రబిహుల్ కిందపడ్డాడు. గమనించిన స్నేహితులు హుటాహుటిన క్షతగాత్రుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ రబీహుల్ ఖాన్ మృతి చెందాడు. ఎంజీఎం మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చారు. రబీహుల్ ఖాన్ ది పశ్చిమ బెంగాల్. అతడి మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా? ఎవరైనా కావాలనే తోసేశారా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement