Sunday, April 28, 2024

ఏబీవీపీ విద్యార్థులపై లాఠీ ఛార్జ్ ని ఖండించిన శ్రీశైలం గౌడ్

బాచుపల్లి VNR కాలేజి పరిధిలో ఈరోజు ఉదయం 6గంటలకు అనుమానాస్పద స్థితిలో విద్యార్థి చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులు కాలేజీ యాజమాన్యాన్ని విద్యార్థి మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు. విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి తరలించడంతో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ బాచుపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుల దాడి విషయంలో పోలీసులపై మండిపడ్డారు.మృతి చెందిన‌ విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు ఆకుల సతీష్, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement