Monday, May 6, 2024

మొక్క‌లు నాటిన బిగ్ బాస్5 విన్న‌ర్ స‌న్నీ- ష‌ణ్ముఖ్, సిరి, శ్రీరామ‌చంద్ర‌ల‌కు ఛాలెంజ్

తెలంగాణ‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఎంపీ సంతోష్ కుమార్ త‌ల‌పెట్టిన ఈ మ‌హ‌త్క‌ర‌కార్యంలో సెల‌బ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా పాల్గొంటున్నారు. కాగా బిగ్ బాస్5 సీజ‌న్ విన్న‌ర్ వీజే స‌న్నీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఈ మేర‌కు మూడు మొక్క‌ల‌ను నాటాడు. అనంత‌రం ఈ ఛాలెంజ్ ని ష‌ణ్ముఖ్ జ‌స్వంత్, సిరిహ‌న్మంత్, శ్రీరామ‌చంద్ర‌ల‌కు విసిరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను మూడు మొక్క‌లు నాటాన‌ని.. ఇదే విధంగా ఈ గొలుసుక‌ట్టుని కొన‌సాగించాల‌ని స‌న్నీ కోరాడు. ఈ సంద‌ర్భంగా ఫొటోలు, వీడియోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. స‌న్నీ మొక్క‌లు నాటిన ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement