Saturday, April 20, 2024

పేటీఎంకి టాప్ లెవెల్ అధికారుల రాజీనామా – కార‌ణం ఇదే

పేటీఎం సంస్థ‌కి షాక్ త‌గిలింది. ఈ సంస్థ‌కు చెందిన ముగ్గురు సీనియ‌ర్ ఉద్యోగులు బ‌య‌టికి వెళ్లిపోయారు. కాగా రాజీనామ చేసిన వారిలో చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ అభిషేక్ అరుణ్, ఆఫ్ లైన్ పేమెంట్స్ సీవోవో రేణు సాతి, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ గుప్తా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు రాజీనామాని స‌మ‌ర్పించారు. అభిషేక్ అరుణ్ ఐదేళ్లకు పైగా పేటీఎంలో ఉన్నారు. అభిషేక్ గుప్తా, రేణు సాతి గత ఏడాదే పేటీఎంలో చేరారు. అయితే వీరు రాజీనామాలు చేసినట్టు పేటీఎం అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు సంస్థ నుంచి బయటకు వెళ్లారు. ఇటీవలే పేటీఎం ఐపీఓకు వెళ్లింది. అయితే ఈ ఐపీఓ ఆదిలోనే నిరాశపరిచింది. ఈ తరుణంలో ముగ్గురు టాప్ లెవెల్ అధికారులు బయటకు వెళ్లడం కంపెనీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement