Saturday, April 27, 2024

అభివృద్ది పనుల్లో వేగం పెంచాలి… బాల్క సుమన్

చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ఆదేశించారు. సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో సెంట్రల్ లైటింగ్ పనులను పర్యవేక్షించారు. అనంతరం ఇందారం పట్టణం సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న ఇందారం బ్రిడ్జ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 15న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామని, ఇందుకుగాను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement