Friday, May 3, 2024

TS : గూడ్స్‌రైలులో పొగ‌లు.. ప‌రుగులు తీసిన ప్ర‌యాణీకులు

ఈ మ‌ధ్య త‌రుచు రైళ్ల‌లో మంట‌లు, పొగ‌లు వ్యాపిస్తున్నాయి. దీంతో రైలులో ప్ర‌యాణించాలంటే ప్ర‌జ‌లు జంకుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా కాజీపేట రైల్వేస్టేష‌న్‌లో చోటుచేసుకుంది.

కాజీపేట రైల్వే స్టేషన్‌లో నాలుగో ప్లాట్ ఫాంపై నిలిచి ఉన్న గూడ్స్ రైలు నుండి పొగలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఒక్క సారిగా భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు గూడ్స్ రైలు నుండి వస్తున్న పొగలను చూసి సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు. అయితే గూడ్స్ లో ఉన్నది బొగ్గు అయి ఉంటుందని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement