Thursday, May 2, 2024

AP : వ‌ర్చువాల్‌గా విశాఖ‌లో అభివృద్ది ప‌నుల‌కు శంఖుస్థాప‌న చేయ‌నున్న సీఎం

ఇవాళ ఏపీలో సీఎం జ‌గ‌న్ వ‌ర్చువాల్‌గా అభివృద్ది ప‌నుల‌కు శంఖుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. విశాఖలో రూ. 1500కోట్ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. వంద‌ కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు.

- Advertisement -

98 కోట్లతో అభివృద్ధి చేసిన పాలిటెక్నిక్, ఐటీఐలను ప్రారంభించనున్నారు CM జగన్‌. రూ.10 కోట్లతో టర్టెల్ బీచ్, వెంకోజీ పాలెం నుంచి మారియట్ హోటల్ జంక్షన్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం, కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మధురవాడ ప్రాంతానికి నీటి సరఫరా ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. అటు ‘విజన్ విశాఖ’ కార్యక్రమం సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో ‘విజన్ విశాఖ’ సమావేశం జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement