Sunday, April 28, 2024

TS : ఆ వ‌దంతులు న‌మ్మ‌ద్దు… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, త్వరలోనే పూర్తిగా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నారనే వార్తలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ ఎన్నికలకు ముందు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, సోషల్ మీడియా వేదికగా, లేదా డైరెక్ట్ గా వెళ్లి స్పందించే ఆర్ఎస్పీ.. ఓటమి తర్వాత కనుమరుగయ్యారు. త‌న పై వ‌స్తున్న వదంతుల‌పై ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ట్వీట్ లో… ” నా రాజకీయ ప్రస్థానం పై వస్తున్న ఎలాంటి వదంతులు నమ్మకండి. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశ వైపే నా ప్రయాణం” కొనసాగుతుందని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement