Wednesday, May 8, 2024

Breaking | వరంగల్ లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదు

వరంగల్ లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 :43 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మొలజి తెలియజేసింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోపల కదలికలు సంభవించినట్లు వెల్లడించింది. తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టం పై ఇప్పటికీ సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement